న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలి వన్డేలో కివీస్ విజయం సాధించగా, మిగతా రెండు వన్డేల్లో విరాట్ సేన గెలుపొంది సిరీస్ను సొంతం చేసుకుంది. ఇది భరత్ కు వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. కొలిన్ మన్రో (75), విలియమ్సన్ (64), టామ్ లేథమ్ (65), నికోల్స్ (37) సమయోచితంగా ఆడటంతో 331/7 పరుగులు చేసింది. చివర్లో బుమ్రా 3 వికెట్లు తీసి భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. అంతుముందు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (147), విరాట్ కోహ్లీ (113) శతకాలతో చెలరేగారు.
