రైళ్ళలో జర్నీలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మార్గాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు.
కాచిగూడ-విశాఖపట్నం స్పెషల్ (రైల్ నెంబర్: 07016) కాచిగూడ నుంచి నవంబరు 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ (రైల్ నెంబర్: 07488) విశాఖపట్నం నుంచి నవంబరు 8, 15, 22, 29వ తేదీల్లో రాత్రి 7.05గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.25గంటలకు తిరుపతి చేరుతుంది.
తిరుపతి-కాచిగూడ స్పెషల్ (రైల్ నెంబర్: 07146) తిరుపతి నుంచి 9, 16, 23, 30వ తేదీల్లో సాయంత్రం 5గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుతుంది.
