కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నక్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రభుదేవా గురువు. ఈ వార్త తెలుసుకున్న ప్రభుదేవా.. కన్నీటి పర్యంతమయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. తర్వాత ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.20వ ఏట నుంచే డ్యాన్స్పై మక్కువ పెంచుకున్న ధర్మరాజు.. తన చిన్నాన్న బీవీ నరసింహరావు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడిన ఆయన ‘లవకుశ’, సీతారామ కళ్యాణం’, ‘ఆదిత్య 369’ , ‘పౌర్ణమి’ సినిమాలతో పాటుగా దాదాపుగా వంద సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు .సినీ రంగానికి చెందిన కృపావతిని వివాహం చేసుకున్నారు.
