నందమూరి బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ జై సింహ “. నయనతార, హరిప్రియ, నఠాషా దోషి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా 30 సెకన్ల నిడివిగల టీజర్ విడుదల చేశారు.చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు .
