దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ ,కోల్ ఇండియా తదితర పలు సంస్థలు లాభాలతో ముగిశాయి.ఎంఅండ్ఎం ,ఆక్సిస్ బ్యాంకు ,అరబిందో ఫర్మా ,ఎస్ బ్యాంకు ,కోటక్ మహేంద్ర మొదలైన తదితర కంపెనీలు నష్టాలతో ముగిశాయి ..
