ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ నిన్న ఓ ఛానల్లో జరిగిన చర్చ కార్యక్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత చెప్పిన విషయం తెలిసిందే.అయితే దీనిపై కత్తి మహేష్ తనదైన శైలిలో స్పందించి తాజాగా తన ట్విటర్ వేదికగా సునీత పై రూ.50 లక్షలు పరువు నష్టం దావా వేయబోతున్నట్టు ట్వీట్ చేశాడు . దీంతో సునీత తనను ఆ ఛానల్ బెదిరిస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీనిని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ అయిన శతఘ్ని మిసైల్ తన ట్విటర్లో షేర్ చేసింది.
ఆ వీడియోలో సునీత ఏం చెప్పిందంటే.. ‘‘మా తల్లిదండ్రులు కూడా నాకు ఇప్పుడు సపోర్ట్ లేరు. నేనసలు ఆ ఛానల్కు వస్తానని నిజంగా చెప్పలేదు. వాళ్లే నన్ను పిలిపించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాను నేను. లేనిదేమీ చెప్పలేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడమన్నారు. కరెక్ట్గానే మాట్లాడాను. మహేష్ కత్తి గురించి కూడా చెప్పాను. మహేష్ కత్తికి ఆ ఛానల్ ఇంత సపోర్ట్ ఇస్తుందని నిజంగా నాకు తెలియదు. వాళ్లు నన్నిప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ ఛానల్కు నేను రాను. నేను లీగల్గా వెళతాను అని చెప్పాను. మహేష్ కత్తి నన్ను రూ.50లక్షలు డిమాండ్ చేస్తున్నాడు కేసు పెడతానని చెప్పి అని అన్ని ఛానళ్లకి ఇచ్చాడంట. ఇప్పుడు ఆ ఛానల్ నన్ను ఫోన్ చేసి బెదిరిస్తోంది’’ అని సునీత తెలిపింది.
@IndiaToday @aajtak @republic @CNN @cnnbrk @BBC @BBCWorld please respond on this issue??
local telugu media channel @TV9Telugu supporting womeniser @kathimahesh & blackmailing This innocent Actresses #Sunitha who was once used by this coward #Kathimahesh
Plz Retweet max???? pic.twitter.com/AQMpSktTBG— PawanKalyan (@JanaSainiks) April 15, 2018