గతేడాది ఆగస్టు నెలలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు.ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ , హిరోయిన్ గా షాలినీ పాండే అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే .అయితే ఆ తర్వాత షాలినీ ఏ సినిమాలోనూ కనపడలేదు . తాజాగా ‘ మహానటి ’ సినిమాలో ఆమె ఓ ప్రాముఖ్యమున్న పాత్రలో మెరవనుంది.
రేపు విడుదల అవుతున్న ‘ మహానటి ’ సినిమా కోసం సావిత్రి అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే షాలినీ పాండే ఈ సినిమాలో పోషించే పాత్ర ఏమై వుంటుందనే ఆసక్తి నెలకొని వుండగా చిత్ర యూనిట్ ఆమె పాత్ర గురించి క్లారిటీ ఇచ్చింది.
సుశీల పాత్రలో షాలినీ మెరవునున్నారు. ఈ సుశీల ఎవరన్నది సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. సుశీల సావిత్రికి చిన్ననాటి స్నేహితురాలు. సావిత్రిది, సుశీలది చాలా అన్యోన్యమైన స్నేహం అంటారు. సావిత్రి స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఆమెతో అంతే ఆప్యాయంగా మాట్లాడేవారట. సుశీలను చూడాలనిపించినప్పుడు తాను వెళ్లడమో .. ఆమెను రప్పించుకోవడమో చేసేవారట. అంతమంచి పాత్ర తనకు లభించడంపై షాలినీ చాలా సంతోషంగా వున్నట్టు తెలుస్తోంది.