టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు .
దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి నుండి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన చెప్పారు .అయితే మరోసారి గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు ..
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు .చైర్మన్ చెలమయ్య అనేది తోలి మూవీ కాగా ఎర్రసూర్యుడు,ఎర్రమల్లెలు,ఎర్ర పావురాలు ,ప్రజాశక్తి,స్వరాజ్యం లాంటి చిత్రాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.మొదటి సినిమాకే అప్పటి ఏపీ ప్రభుత్వం అవార్డును కూడా ఇచ్చింది .