తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హిరోయిన్ గా మెహరీన్ నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న కథే’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్తో టీజర్ మొదలైంది.అయితే ఈ టీజర్లో ‘ఉచిత కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు రూ.5000 ఇస్తాం అనగానే ముందు వెనకా, మంచి, చెడు ఆలోచించకుండా ఓటేసేసి ఇప్పుడు అవినీతి లేని సమాజం కావాలి, అవినీతి లేని దేశం కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయ్?’ అని న్యాయస్థానంలో గోపీచంద్ ప్రశ్నిస్తున్న విధానం హైలైట్గా నిలిచింది.ఆ టీజర్ మీకోసం..
