బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్ ఈ నెల 10 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే ఈ షో పై మొదటినుండి విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణకు సంబంధించిన వారు ఒక్కరుకూడా లేరని పలువురు విమర్శిస్తున్నారు.ఈ క్రమంలోనే కత్తి కార్తీక తన అభిప్రాయాన్ని తెలిపింది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. బిగ్ బాస్ సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని… ఈ సీజన్ లో కూడా తెలంగాణ వాళ్ళను పెట్టిఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని తెలిపింది.తెలంగాణ జానపదమో, ఆ భాషనో హౌస్ లో ఉంటే, ఆ మసాలా ఘాటు తగిలేదని తెలిపింది.ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది.బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో వీ6 ఛానల్ యాంకర్ గా ప్రజలను అలరించిన సంగతి విదితమే.
