తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో వార్త హాట్టాపిక్ గా మారింది. వాస్తవానికి భారత పార్లమెంట్ లో ప్రతి పార్టీకి ఎంపీల సంఖ్యాబలం పగా కొన్ని గదులు, కొన్ని ఫర్నిచర్ కేటాయిస్తారు. అయితే టీడీపీకి ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటులో కనీసం ఒక్క గది కూడా దొరకలేదట. ప్రతి లోక్ సభ ప్రారంభ సమయం లో ఆయా పార్టీల సంఖ్య బలానికి అనుగుణంగా గదులను కేటాయిస్తారు. ఉభయసభల్లోనూ పార్టీ బలాలను బట్టి ఈ సారి దేశవ్యాప్తంగా మొత్తం 14 పార్టీలకు కేటాయించింది.
అయితే పార్లమెంట్ దగ్గర గ్రౌండ్ లో 5వ నెంబర్ గది గత కొన్ని ఏళ్లుగా టిడిపి కి కేటాయించేవారు.. ఇప్పుడు కేవలం ఇద్దరే టీడీపీ ఎంపీలు ఉండడంతో ఆ గదిని వైసీపీకి కేటాయించింది. దీంతో ఉన్న ఇద్దరు ఎంపీలు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి.. ఎక్కడ ఉండేది అనేది ఆలోచించుకుంటున్నారట. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీలకు కనీసం పార్లమెంటులో గది కూడా దక్కించుకోలేక పోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. కాదండీ బాధగా ఉండదంటీ.. పార్లమెంటునుండి గెంటేస్తారా అండి అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు.