మేడ్ ఫర్ ఈచ్ అదర్గా పేరు తెచ్చుకున్న చై,సామ్లు విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సామరస్యంగా విడిపోతున్నామంటూ ఇరువురు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటపై విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వల్ల చై, సామ్లు నెట్టింట మళ్లీ హాట్ టాపిక్గా నిలిచారు. వీటన్నింటికి విసుగెత్తిపోయిన చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు.
“కెరీర్లో నేను సాధించిన సక్సెస్ కంటే నా పర్సనల్ లైఫ్ ఎక్కువగా ఫోకస్ అవడం చూస్తుంటే చిరాకుగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తప్పకుండా అందరితో పంచుకుంటున్నా. నా లైఫ్ గురించి ఎంతవరకు అవసరమో అంత చెప్తా. డైవర్స్ గురించి కూడా నేను, సమంత ఏం చెప్పాలి అనుకున్నామో అది సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాం. విడిపోయిన తర్వాత ఎవరి జీవితాల్లో వారు ముందుకు వెళ్లాలి అని అనుకున్నాం. దీనికి మించి మా మధ్య జరిగిన ఏ ఒక్క విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పాలి అనుకోవడం లేదు. అసలు నా లైఫ్లో ఏం జరిగిందో నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కు తెలుసు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు నేను స్పందిస్తే మరో వార్త ప్రచారం అవుతుంది. ఇవన్నీ తాత్కాలికమైనవే. వాటిని నేను పట్టించుకోను. ఏదో ఒకరోజు ఈ ప్రచారాలన్నీంటికీ ముగింపు ఉంటుందనే నమ్మకం నాకు ఉంది.” అని చైతూ ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.