చెక్బౌన్స్ కేసులో తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి లింగుస్వామి అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. సమంత, కార్తిలతో ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆరంభంలోనే ఆగిపోయింది. ఈ మేరకు పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న అప్పు చెల్లించేందుకు చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని లింగుస్వామి, ఆయన సోదరుడు పీవీపీకి తిరిగి చెల్లించారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో సోమవారం విచారణ జరిగి వారికి 6 నెలల శిక్ష పడింది. ఇటీవల రామ్, కృతిశెట్టి జంటగా నటించిన ది వారియర్ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు.