Home / CRIME / వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ

వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ

సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్, నటి అనసూయ. అయితే ఈ సారి మాత్రం తాను చేసిన ఓ పోస్ట్‌తో విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంటోంది రంగమ్మత్త. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ.

లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన సమయంలో అనసూయ ట్విట్టర్ వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా!!’ అని ఓ పోస్ట్ పెట్టింది. దీంతో విజయ్‌ను ఉద్దేశించే ఇలా రాసుకొచ్చిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకండా ఆమెను # అనసూయ ఆంటీ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. రకరకాల మీమ్స్, కామెంట్స్ పెడుతూ యాంకర్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

‘నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైంది. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదు చేయాలా, వద్దా? అని చాలా ఆలోచించా. కానీ, జరగాల్సింది.. జరగాలి. నా కంప్లైంట్‌కి స్పందించి, నాకు మద్దుతు ఇచ్చిన సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ధన్యవాదాలు’’ అని అనసూయ ట్వీట్ చేసింది. #SayNoToOnlineAbuse, #StopAgeShaming అనే హ్యాష్‌ట్యాగ్‌లు కూడా జత చేసింది నటి అనసూయ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat