నటి అమలాపాల్ తన ఫ్రెండ్, పంజాబీ సింగర్ భవ్నిందర్సింగ్ దత్ను వివాహం చేసుకుందట. అయితే ఇటీవల తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమలాపాల్ భవ్నిందర్సింగ్ దత్పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో భవ్నిందర్సింగ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం భవ్నిందర్సింగ్ తరఫు లాయర్ ఈ విషయం న్యాయస్థానంలో చెప్పి అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాడట. అందుకే భవ్నిందర్సింగ్కు గ్ బెయిల్ వచ్చిందని కోలీవుడ్లో న్యూస్ హల్చల్ చేస్తుంది. దీంతో అమలాపాల్ రెండో పెళ్లి నిజమే అని వార్తలు వస్తున్నాయి.
ఆ ఫోటోలు వైరల్
2020లో అమలాపాల్, భవ్నిందర్సింగ్ సోషల్ మీడియాలో పంజాబీ సంప్రదాయంలో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇవి వైరల్ అవ్వగా వెంటనే డిలీట్ చేసేశారు. అయితే ఆ ఫోటోలు ఫోటో షూట్ కోసమే తప్ప వారికి పెళ్లి జరగలేదని అప్పట్లో అమలాపాల్ ఖండించింది.