కేజీఎఫ్తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్నీల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్కు సంబంధిచిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ నటించిన సీన్కు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఎంతో కష్టపడి సీన్స్ తెరకెక్కిస్తుంటే ఆ ఫొటోలు ఇలా బయటకు వచ్చేస్తుండటంపై ప్రశాంత్ నీల్ సీరియస్గా ఉన్నారట. అందుకే ఇకపై సినిమా షూటింగ్ వచ్చేవారు మొబైల్ని తీసుకురావొద్దని కండిషన్పెట్టాడట. షూటింగ్కు వచ్చే నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది తమ మొబైళ్లను కారవ్యాన్ లేదా లాకర్లో పెట్టి రావాలని సూచించాడు.
గతంలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలోనూ ఫొటోలు, వీడియోలు లీక్ కావడంపై దర్శకుడు రాజమౌళి సీరియస్ అయ్యాడు. షూటింగ్కు వచ్చే సిబ్బంది, నటీనటుల మొబైళ్లను తీసుకురావొద్దని చెప్పిన విషయం తెలిసిందే.