ప్రస్తుతం ఎక్కడ వింటున్నా నయనతార- విగ్నేష్ శివన్ దంపతుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు ఒక్కటైన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యామని చెప్పారు. దీంతో అందరూ ఈ జంట సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టిన సంతోషం ఎంతో కాలం లేకుండానే వివాదంలో చిక్కుకున్నారు ఈ జంట. సరోగసి ప్లాన్ చేశారని కోర్టు వరకు వెళ్లింది ఈ వివాదం. తాజాగా తమిళనాడు హెల్త్ మినిస్టర్ దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా నయన్, విగ్నేష్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సరోగసి.. పిల్లలు పుట్టని వారికి ఇదో వరం. అయితే సరోగసి ప్లాన్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. పెళ్లయిన దంపతులకు 5, 6 ఏళ్ల అయినా పిల్లలు పుట్టని దంపతులు సరోగసికి ప్లాన్ చేయోచ్చు. ఇందుకు లీగల్గా కొన్ని సరోగసి నిబంధనల మేరకు రిజిస్టర్ చేసుకోవాలి.
తాజాగా షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు నయన్ దంపతులు. ఈ జంటకు 6 ఏళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ను కోర్టుకు అందజేశారు. అంతే కాకుండా అన్ని నిబంధనల ప్రకారమే గతేడాది డిసెంబరులో సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు కోర్టుకు అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా యూఏఈలో ఉంటోన్న నయన్ బంధువు ద్వారా వీరు సరోగసి ప్రాసెస్లో పిల్లల్ని కన్నామని వివరించారు.