కరోనా టైం నుంచి సినీప్రియులు ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు. థియేటర్లలో మూవీలు రిలీజవుతున్నా ఓటీటీల్లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఆడియన్స్ ఇంట్రస్ట్కు తగ్గట్టు మూవీ టీమ్ కూడా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తాము అనుకున్న కథను ఎపిసోడ్స్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా కూడా ఓటీటీలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది. మరి ఆ మూవీ ఏంటో.. ఎందులో స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజ్తరుణ్ హీరోగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అహ నా పెళ్లంట!. సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివానీ, ఆమని, హర్షవర్థన్, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ 17న అహ నా పెళ్లంట జీ5 వేదికగా రిలీజ్ కానుంది. మొత్తం 8 ఎపిసోడ్స్గా ఈ మూవీ అలరించనుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతోందా అని సినీ ప్రియులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. సాయి దీప్ రెడ్డి బొర్ర, సూర్య రాహుల్ తమాడ నిర్మాతలు. జుదాహ్ శాండీ సంగీతం అందించారు.