Home / MOVIES / అయ్యో అన్నా.. నీకే ఎందుకిలా.. ఒక్క ఏడాదే ముగ్గురు!

అయ్యో అన్నా.. నీకే ఎందుకిలా.. ఒక్క ఏడాదే ముగ్గురు!

మహేశ్‌బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది. ఒక్క ఏడాదే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. సోదరుడు, తల్లి, ఇప్పుడు తండ్రి మృతి చెందడంతో శోకసంద్రంలో మునిగిపోయారు మహేశ్‌బాబు.

మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధికి గురయ్యి.. జనవరి 8న కన్నుమూశారు. అన్నను కోల్పోయిన బాధ నుంచి కోలుకోక ముందే తల్లి ఇందిరాదేవి దూరం అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహేశ్‌బాబు తల్లి హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ సెప్టెంబరు 28న చనిపోయారు. తల్లి దూరమై కనీసం రెండు నెలలు కూడా పూర్తవక ముందే తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు మహేశ్‌బాబు.

ప్రస్తుతం మహేశ్‌బాబు పరిస్థితిని తలచుకొని ఆయన అభిమానులు మరింత బాధపడుతున్నారు. అయ్యో అన్నా నీకే ఎందుకిలా అవుతుంది. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయావు. అందులోనూ నెలల తేడాలోనే తల్లీ తండ్రికి దూరమయ్యావు. నీ వెంట మేమంతా ఉన్నాం.. ధైర్యంగా ఉండు అన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat