తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాచిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేటర్ చైతన్య భర్త కన్న యాదవ్ ఆ ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నాడు.
ఈ విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారిణి వాణి అక్కడకు వెళ్లి భవన నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఆ భవన నిర్మాణానికి అనుమతులు లేవని ఆమె చెప్పారు.
దీంతో ఆగ్రహం తెచ్చుకున్న కన్న యాదవ్ ఆమెపై దాడికి దిగాడు. తన మీద జరిగిన దాడిపై జీహెచ్ఎంసీ అధికారిణి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.