సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురిపై ఇన్నాళ్లు టీవీ చర్చల్లో, ఫేస్బుక్ పోస్టులలో విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
సినీ విమర్శకుడు కత్తిమహేష్ రూటు మార్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్లో తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించిన మహేష్… పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. అదేరీతిలో సినీ నటి పూనం కౌర్పైనా ఘాటు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు ఆపితే….తాను అతనిపై విమర్శలు దాడిని ఆపగలనని చెప్పారు.
నా హక్కును…నేను కాపాడుకోలేనా…అని కత్తి మహేష్ తన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కత్తి మహేష్ వెల్లడించారు. తన అభిమానులను కాపాడలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా కాపాడుతాడని మహేష్ ప్రశ్నించారు. `నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. ఏ మీడియా నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడించడం లేదు` అని మహేష్ స్పష్టం చేశారు. తనపై పరువు నష్టం కేసు వేసిన ఆరోపణలు నిరూపించేందుకు తాను సిద్ధమని కత్తి మహేష్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత భద్రత రాష్ట్ర పోలీసులు చూసుకుంటారని ఆయన తెలిపారు. `కోన వెంకట్ అంటే నాకు గౌరవం.నాకు మంచి మిత్రుడు కూడా. కానీ ఒక వైపు నన్ను బెదిరిస్తూనే…మరో వైపు చర్చలకు రమ్మంటున్నాడు.` అని మరో సంచలన కామెంట్ చేశారు కత్తి మహేష్.
మహేష్ ఆరు ప్రశ్నలివి..
1 .పూనమ్ కౌర్కు బ్రాడ్ అంబాసిడర్ పేరు ఎవరి ద్వారా వచ్చింది?
2. తిరుమలలో పవన్తో పాటు నిలబడీ ఒకే గోత్రంతో పూజ చేసింది నిజం కాదా..?
3. పవన్ మోసం చేశాడనే బాధతో ఆత్మహత్యయత్నం చేసుకుంది నిజం కాదా? అప్పుడు మీరు ఉన్న ఆస్పత్రి ఏంటి? ఆ బిల్లులు కట్టింది ఎవరు?
4.మీ అమ్మను కలిసిన పవన్ ఏం హామీ ఇచ్చారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా లేదా?
5.డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం…?
6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగంతో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? అక్కడ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్తో కలిసి అక్కడ మీరేం చేశారో చెప్పండి.