Home / Jhanshi Rani (page 64)

Jhanshi Rani

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు ఇకలేరు

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో వచ్చిన ఎన్నో సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. గౌతమ్‌ రాజు మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. చిరంజీవి సహా పలువురు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆది, కిక్‌, గబ్బర్‌ సింగ్‌, రేసుగుర్రం, ఖైది నెం 150, …

Read More »

‘అల్లు’ ఫ్యామిలీ ఫారిన్‌ టూర్‌.. ఫొటో వైరల్

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున తన ఫ్యామిలీతో ఫారిన్‌ టూర్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, అతడి భార్య స్నేహారెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌, కుమార్తె అల్లు అర్హ టాంజానియాలో ఉన్నారు. అక్కడి నేషనల్‌ పార్కును అల్లు ఫ్యామిలీ సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు అల్లు అర్జున్‌ అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం …

Read More »

కోమాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమాని మృతి

ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని జనార్దన్‌ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదానికి గురై గతకొంతకాలంగా కోమాలో ఉన్న అతడు ఈరోజు చనిపోయాడు. ఇటీవల తన అభిమానులతో విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్‌ జనార్దన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. దేవుడిని నమ్మాలని భరోసా ఇచ్చాడు.అంతేకాకుండా జనార్దన్‌ చెవి దగ్గర ఫోన్‌ పెట్టడంతో అతడితో ఎన్టీఆర్‌మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ విధికి కనికరం పుట్టలేదు. జనార్దన్‌ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు …

Read More »

తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్‌ అభినందన

పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …

Read More »

జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్‌ ఆదేశం

రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …

Read More »

హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు

ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్‌, కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ లుక్‌ అదుర్స్‌..

మలయాళ సూపర్‌హిట్‌ మూవీ ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ మూవీలో ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్‌ లుక్‌ను ‘గాడ్‌ ఫాదర్‌’ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ఈ మూవీలో చిరంజీవి పొలిటికల్‌ లీడర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఛైర్‌లో చిరంజీవి కూర్చొని ఉన్న ఫొటోను టీమ్‌ విడుదల …

Read More »

ప్రజాప్రతినిధులకు తమిళనాడు సీఎం స్ట్రాంగ్‌ వార్నింగ్‌

తన పాలనలో అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారతానని తమిళనాడు సీఎం స్టాలిన్‌ హెచ్చరించారు. అక్రమాలను ప్రోత్సహించనని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. తమిళనాడులోని నామక్కల్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్టాలిన్‌ మాట్లాడారు. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదని.. అలా తానెప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. ఈ వార్నింగ్‌ స్థానిక ప్రజాప్రతినిధులకే కాదని.. ప్రతి ఒక్కరికీ అని క్లారిటీ ఇచ్చారు స్టాలిన్‌.

Read More »

కానిస్టేబుల్‌, ఎస్సై ప్రిలిమినరీ టెస్ట్‌ తేదీలివే..

తెలంగాణలో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌ తేదీలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్‌ 7న ఎస్సై, 21న కానిస్టేబుల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎస్సై అభ్యర్థులు ఈనెల 30 నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆగస్ట్‌ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రభుత్వం …

Read More »

అప్పుడే లొంగలేదు.. ఇప్పుడు లొంగుతానా?: జగ్గారెడ్డి

తానేం మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీ కోసమేనని.. ఆ పార్టీ లైన్‌లోఏ ఉంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. పార్టీనుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదని.. ఇప్పుడు లొంగుతానా? …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat