దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్పీజీ …
Read More »సంజయ్లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్రెడ్డి
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటనల వెనుక టీఆర్ఎస్ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …
Read More »‘అగ్నిపథ్’ పేరుతో యువత ఉసురు తీస్తున్నారు: మంత్రి నిరంజన్రెడ్డి
బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు వ్యవసాయచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘అగ్నిపథ్’ పేరుతో యువత ఉసురు తీస్తోందని ఆరోపించారు. ‘అగ్నిపథ్’ అనాలోచితమైన నిర్ణయమన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరుద్యోగ యువకుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 90 రోజుల్లోనే 46వేల మంది నియామకం చేపట్టి కేవలం రూ.30వేల జీతం ఇవ్వడం అర్ధరహితమన్నారు. దేశభద్రత విషయంలో ఇలాంటి …
Read More »సమంతకు ఇన్స్టాలో వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?
టాప్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా ఆమె ఉన్నారు. ఫ్యామిలీమెన్ 2 మూవీతో బాలీవుడ్లోనూ సామ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంత.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఉంటుంది. సినిమాల్లో నటిస్తే ఆమెకు రెమ్యునరేషన్ ఎలాగో.. సోషల్ మీడియాలోనూ ఆమె దాదాపు అలాగే సంపాదిస్తోంది. సామ్కు ఇన్స్టాగ్రామ్లో 2కోట్ల మంది ఫాలోవర్స్ …
Read More »రాష్ట్రపతి ఎన్నిక.. వైసీపీ వైఖరిపై విజయసాయి స్పందన ఇదే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఈడీ విచారణ కేంద్రం కక్షేమీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ స్థాయీ సంఘానికి సంబంధించిన నివేదికను ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఢిల్లీలో ఆయన అందించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్పై ఈడీ కేసుపై స్పందించారు. ఇందులో కక్ష సాధింపేమీ లేదని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరిపై విజయసాయిని …
Read More »ఆ భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి: జగన్ ఆదేశం
పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు …
Read More »మెగా కపుల్ ఎంజాయ్ మామూలుగా లేదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహ బంధం మంగళవారం (జూన్ 14) నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్స్టాలో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.
Read More »ఆకాశ్పూరీ ‘చోర్ బజార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్ బజార్’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ మూవీలో ఆకాశ్కు జంటగా గెహనా సిప్పి నటించారు. బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా, వీఎస్ రాజు నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని …
Read More »కేసీఆర్ను కించపరుస్తూ స్కిట్.. బీజేపీ నేతలు అరెస్ట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …
Read More »రూ.54కే లీటర్ పెట్రోల్.. ఈ ఒక్కరోజే బంపర్ ఆఫర్
లీటర్ పెట్రోల్ కేవలం రూ.54 మాత్రమే. ఎప్పుడో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేస్తే.. ఇంత తక్కువకేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమేనండీ బాబూ! మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఓ బంక్లో ఈరోజంతా అదే రేటుకు పెట్రోల్ అమ్మారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందజేశారు. దీంతో …
Read More »