తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్, చత్తీస్గఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు …
Read More »విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్ బైక్
విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొన్నాననే ఆనందం ఆవిరైపోవడమే కాకుండా ఆ వ్యక్తిని సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని సూర్యారావు పేటలోని గులాబీతోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి శుక్రవారం కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. బైక్ బ్యాటరీకి శనివారం ఉదయం తన బెడ్రూంలో ఛార్జింగ్ పెట్టాడు. అయితే అది ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు …
Read More »మా విచారణకు హాజరు కావాలి: చంద్రబాబుకు నోటీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …
Read More »దేశంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ చేసి చూపించారు: కేటీఆర్
దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …
Read More »మూడు రోజుల్లో పెళ్లి.. అత్త, ఆడపడుచుకు మత్తు మందు ఇచ్చి వధువు పరార్
సినిమాలోని కక్షపూరిత సన్నివేశాన్ని తలపించే ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మరో మూడురోజుల్లో పెళ్లి ఉండగా కాబోయే అత్త, ఆడపడుచుకు పెళ్లికుమార్తె టీలో మత్తు మందు కలిపి ఇచ్చేసి ఆ ఇంట్లోని డబ్బుతో ఉడాయించింది. మధ్యప్రదేశ్లోని మందసౌర్ ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబంలోని వ్యక్తికి వయసు అయిపోతున్నా పెళ్లికాకపోవడంతో ఆ కుటుంబసభ్యులు ఓ మహిళను సంప్రదించారు. ఆమె రూ.2లక్షలు తీసుకుని ఆర్తిబింద్ అనే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చింది. మరో మూడు …
Read More »రేవంత్ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి
రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్ …
Read More »బండి సంజయ్.. ఆర్డీఎస్ ఎలా పూర్తిచేస్తావో చెప్పగలవా?: నిరంజన్రెడ్డి సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్కు మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల …
Read More »ఆయనలా హామీలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీ అమెరికా అవుతుందా?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …
Read More »‘కేజీఎఫ్’ థియేటర్లో ‘సీటు’ గొడవ.. ప్రేక్షకుడి కాల్పులు
కేజీఎఫ్ఛాప్టర్2 ప్రదర్శిస్తున్న థియేటర్లో అనూహ్య ఘటన చోటుచేఉకుంది. ఇద్దరు యువకులు థియేటర్లో సీటు కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో అందులోని ఓ వ్యక్తి తుపాకీతో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని హవేరి జిల్లా షిగ్గాన్లోని ఓ థియేటర్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా నడుస్తోంది. మంగళవారం రాత్రి ఓ యువకుడు ముందు సీటుపై కాలుపెట్టి చూస్తుండగా.. అందులో కూర్చొన్న వ్యక్తి సీరియస్ అయ్యాడు. దీంతో …
Read More »తొలుత ఆ మూడుశాఖల్లో నియామకాలు పూర్తిచేస్తాం: మంత్రి సబిత
రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల శిక్షణకు ఉస్మానియా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత పోలీసు, విద్య, వైద్యశాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఈ మూడు శాఖల్లోనే …
Read More »