ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తన అభిమానులు చేసే ఓవర్ యాక్షన్ గురించి అన్నీ తెలుసని,కావాలనే స్పందించడం లేదని సినీవిశ్లేషకుడు మహేశ్ కత్తి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ని కొందరు దేవుడని అంటున్నారని, ఆయన దేవుడా? అని మహేశ్ కత్తి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒకవేళ తన ఫ్యాన్సు చేష్టలపై స్పందిస్తే తాను పవన్కి దాసోహం అయిపోతానని వ్యాఖ్యానించారు. జనసేనాని రిప్లై ఇస్తే …
Read More »చేనేత కార్మికులకు మరో నూతన పథకం..మంత్రి కేటీఆర్
చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతం శ్రమించే తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని నేతన్నల కోసం తీసుకువచ్చింది. ఇప్పటికే నేతన్నల కోసం పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చేనేత శాఖా మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నెల 18 తేదిన వరంగల్ పట్టణంలో చేనేత కార్మికులకు “యార్న్ సబ్సీడి’’ పథకాన్ని ప్రారంభిస్తామని అయన తెలిపారు. ఈ …
Read More »మంత్రి కేటీఆర్తో న్యూఢిల్లీ పురపాలక అధికారుల భేటీ..కీలక నిర్ణయం ప్రకటించిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరింత ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ముందడుగు వేశారు. ఈ రోజు సచివాలయంలో న్యూడీల్లీ మునిపిపల్ కౌన్సిల్ (ఏన్డీయంసీ) ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.NDMC ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనులను నిర్వహిస్తున్న తీరును మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్ విడుదల అయింది. రేపు (మంగళవారం) ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ముందుగా ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8గం.30ని. ఛాగలమర్రి నుంచి పాదయాత్ర మొదలౌతుంది. ఉదయం 10గం.లకు ముత్యాలపాడు బస్టాండ్ కు చేరుకోగా.. అక్కడ ప్రజా సమావేశంలో వైఎస్ జగన్ …
Read More »సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విజన్తో ఇంటింటికీ ఇంటర్నెట్..జయేష్ రంజన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించేందుకు విజయవంతంగా తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ భారత్ నెట్ ఫేజ్ 2 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కేంద్ర …
Read More »అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని దుమ్ము దులిపిన కేసీఆర్..!
ఇవాళ శాసనసభలో రైతులకు పెట్టుబడి, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరపూరిత నిర్లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపై సీఎం నిప్పులు చెరిగారు. కృష్ణా, గోదావరి జీవనదుల మధ్య ఉన్న తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎవరి పుణ్యమా అని వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు 1330 టీఎంసీల …
Read More »ఆటో స్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. సీఎం కేసీఆర్
శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. కరెంట్ సరఫరాలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతులందరికీ ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే …
Read More »రైతన్నల అండతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం..సీఎం కేసీఆర్
తెలంగాణ రైతాంగానికి భవిష్యత్ బంగారుమయం చేయబోతున్నామని, రైతుల సహాయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటల విద్యుత్తో పెట్టుబడులు …
Read More »రైతాంగానికి పెట్టుబడి ఇస్తుంటే విమర్శలు చేయడం సరికాదు..కేసీఆర్
శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు సీఎం సూచించారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. ఆ …
Read More »ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం..
ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు . రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణా పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మహేందర్రెడ్డి ప్రకటించారు. శాసనసభలోప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో చెన్నై తర్వాత సిరిసిల్లలో అతిపెద్ద డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. క్లీనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నందున.. …
Read More »