మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుతోనే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టొచ్చన్నారు ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర రామ్(IAS). భారీ ప్రాజెక్టు ఐన భగీరథను తక్కువ కాలంలో పూర్తిచేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంజనీర్ల బృందంతో వచ్చిన సురేంద్రరామ్, ఇవాళ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డిని కలిశారు. …
Read More »సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..కేటీఆర్
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమ నియోజకవర్గ ఇన్చార్జీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గ నిర్దేశం మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇన్చార్జ్ లను కోరారు. …
Read More »కోనేరు కృష్ణారావు అరెస్ట్.. చట్టానికి ఎవరూ అతీతులు కారు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో అటవీశాఖ అధికారిణి అనితపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాడి ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి …
Read More »విశ్వమంతా విత్తన విప్లవం రావాలి.. గవర్నర్
విశ్వమంతా విత్తన విప్లవం రావాలి. ప్రపంచ ఆకలి తీరాలి. ఆహార భద్రతతో మానవాళి సంతోషం మురవాలి. విత్తనం పుట్టుక మొదలు అభివృద్ది వరకు సమగ్ర చర్చ జరగాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. నోవాటెల్ లో జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సు ముగింపు సమావేశానికి హాజరయిన ఆయన సదస్సును ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. వ్యవసాయంలో విత్తనం చాలా కీలకం అని, కల్తీ విత్తనం అమ్మడం అంటే ఆత్మహత్యకు …
Read More »ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి.. మంత్రి తలసాని
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జులై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఇవాళ ఆలయంలో కల్యాణం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు …
Read More »రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం..హరీష్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ముండ్రాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”ఈ ఇండ్లు చూస్తుంటే హైదరాబాద్ లో ఉన్నా అపార్ట్ మెంట్ భవనాలమాదిరి కనిపిస్తున్నాయి. ఏనుకటి రోజుల్లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండేది. రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం,కళలో కూడా ఊహించని ఇండ్లు …
Read More »మా వంతు సహాయం చేస్తాం.. మహేష్ బిగాల
ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అందుకున్నారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సభ్యత్వ …
Read More »రైతుంబంధును కర్ణాటకలో అమలుచేస్తాం..!!
తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి శివశంకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్ లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయిన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Read More »తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం..!!
తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న 20 అత్యుత్తమ పథకాలలో తెలంగాణ నుండి రైతుబంధు, రైతుభీమా పథకాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఈ పథకాలను అన్ని దేశాలకు వివరించాలని ఆహ్వానించిందని, రైతుల పట్ల కేసీఆర్ నిబద్దత, చిత్తశుద్ది మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యం అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా …
Read More »తెలంగాణ లో విత్తనాల పంట పండాలి
విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంతంలో శ్రేష్టమయిన వాతావరణం ఉంటుంది. తెలంగాణలో ఉత్పత్తి అయిన విత్తనం ప్రపంచంలో ఎక్కడయినా పండుతుంది. తెలంగాణ లో విత్తనాల పంట పండాలి. ఆ విత్తనాలు ప్రపంచ పంటలకు ఆధారం కావాలి. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి …
Read More »