తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బహదూర్ పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన “తెలంగాణ సంక్షేమ సంబురాలు”లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తమకు జరిగిన మేలును వివరిస్తూ సీఎం కేసీఆర్ …
Read More »రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతాం
సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు పూర్తి చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం రాత్రి చింతబవి లో దాదాపు రూ.70 లక్షల ఖర్చుతో చేపడుతున్న సివరేజ్ పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …
Read More »ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ వారి సహకారంతో శనివారం భారత నగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో దశల వారీగా కాలనీలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో సుమారు …
Read More »దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్…
తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.1000 పెంచుతూ గౌరవ సీఎం కేసీఆర్ గారు నిన్న ప్రకటించిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారి కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3116/- పెన్షన్ ఇస్తుండగా, దానిని రూ.4116/-కు పెంచుతూ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని …
Read More »మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి..?
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మిరుగు, మిర్గం, మృగం అనే పేర్లతో పిలుస్తారు. నేటి నుంచి వాతావరణం చల్లబడుతుంది. కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి, వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకునేందుకు ఈరోజు ప్రజలు తప్పకుండా చేపలు తింటారు. ఇవాళ ఏ ఇంట్లో చూసినా చేపల కూరే దర్శనమిస్తుంది. అలాగే బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు.
Read More »ఆ హీరోయిన్ తో మెగా హీరో కి నిశ్చితార్థం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈరోజు శుక్రవారం జరగనుంది. హైదరాబాద్ లో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వరుణ్ సన్నిహితులు తెలిపారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారట. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
Read More »రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయంటే..?
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈ వానాకాలం సీజన్ రైతుబంధు డబ్బులను వారం, పది రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు వ్యవసాయశాఖ ప్లాన్ చేస్తోంది. దాదాపు 65 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.7400 కోట్లు అవసరం అవుతాయని అంచనా. మొదటి రోజు ఎకరంలోపు రైతులకు.. ఆ తర్వాత రోజు ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్ ఆఖరు …
Read More »ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం
ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కొన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. వేల మంది గాయాలపాలైన సంగతి తెల్సిందే. మరువక ముందే అదే రాష్ట్రంలో మరో రైలు బోగీలో మంటలు రావడం కలకలం రేపింది. దుర్గ-పూరీ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ఖరియార్ రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ …
Read More »నేడు ఖమ్మం జిల్లాకు బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ ..కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై నేతలతో సమీక్షించనున్నట్లు సమాచారం.
Read More »కేసీఆర్ కిట్.. ‘మాతృవందన’కు డబుల్
మాతాశిశు మరణాల నివారణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం దేశానికే ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృవందన యోజన’ (పీఎంఎంవీవై) పథకం కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ రెట్టింపు స్థాయిలో ప్రయోజనకారిగా ఉన్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య రంగంలో సాధించిన …
Read More »