Home / rameshbabu (page 1241)

rameshbabu

ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ భవనం 84 లక్షలతో నిర్మితమయింది. నూతన భవనాన్ని ప్రారంభించడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, పోలీసు బృందం పాల్గొన్నారు.

Read More »

రాజధాని మార్పుపై మంత్రి గౌతమ్ రెడ్డి క్లారీటీ..!

నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుండి వైసీపీ సర్కారు తరలిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు విషప్రచారం చేస్తోన్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాజధాని మార్పుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారీటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని  క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ చెప్పిందే …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేపై తిరగబడిన వరద బాధితులు

నవ్యాంధ్రలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు చుక్కెదురైంది. ఈ రోజు గురువారం పెనుమూడిపల్లెపాలెంలో వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై తిరగబడ్డ జనం అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరు వచ్చారా అంటూ ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రభుత్వం …

Read More »

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలు

తెలంగాణలో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఇవాళ్టితో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందని కేటీఆర్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్‌ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ …

Read More »

హైదరాబాద్  మెడలో మరో మణిహారం

తెలంగాణ  రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్  మెడలో మరో మణిహారం చేరనుంది. ఇ-కామర్స్‌ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్‌ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది. పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.అమెజాన్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, సంస్థ …

Read More »

సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …

Read More »

పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న జీవన్‌రెడ్డి ఇవాళ ఉదయమే వరంగల్ పట్టణానికి చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకు రాసిన అన్ని సెమిస్టర్లలో ఎమ్మెల్యే …

Read More »

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రోరైల్ ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలను అందిస్తున్న మెట్రో ఇప్పుడు చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మధ్య ప్రతి 4 నిమిషాలకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచిచూడాల్సిన అగత్యం తప్పింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్విన్ సింగిల్‌లైన్ మెథడ్ కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండేది. మంగళవారం నుంచి …

Read More »

నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్

నవ్యాంధ్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …

Read More »

సిరిసిల్లలో నేడు కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నా రు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి, ఇతర అధికారులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat