తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ …
Read More »రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …
Read More »మహిళా జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ భరోసా
ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా …
Read More »రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు ఎందుకుంటుంది..?
మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తును గమనించే ఉంటారు. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని.. మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఈ గుర్తును చివరి బోగీకి పెడతారట.
Read More »రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త
రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో గృహరుణాలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. MSME రుణాలు కూడా 8.4% వడ్డీకే ఇస్తామని పేర్కొంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని BOB వివరించింది.
Read More »కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?
ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ను బెదిరించిన వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. తనను చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 506 సెక్షన్ కింద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు …
Read More »సునీల్ గవాస్కర్ రికార్డుకు నేటికి 36 ఏళ్లు
టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Read More »మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మదు మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు. ఢిల్లీలో ఈనెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.
Read More »