తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26వేల పాఠశాలల్లోని 54,201 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అయితే, కొత్త వేతనం అమలు ఎప్పటినుంచి అనేది …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …
Read More »వాణీజయరామ్ మృతి కేసులో ట్విస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని వాణీ జయరామ్ నిన్న కన్నుమూసిన సంగతి విదితమే. అయితే ప్రముఖ గాయని వాణీజయరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఇది ఎలా అయిందన్న దానిపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం …
Read More »మహారాష్ట్ర లో బి.ఆర్.ఎస్ కు అంకురార్పణ
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతల సమక్షంలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ అదే దూకుడుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నది. ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి …
Read More »భారీగా పడిపోయిన బంగారం ధరలు
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నేడు బంగారం,వెండి ధరలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా పరుగులు పెట్టిన బంగారం ,వెండి ధర ఇప్పుడు నెమ్మదించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి రూ.700 మేర పడిపోయి రూ.52,400 మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.770కి పడిపోయి.. 10 గ్రాములకు రూ.57,160 వద్ద కొనసాగుతోంది. ఇక …
Read More »రెజీనాతో రిలేషన్ పై సందీప్ కిషన్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం సహజమే. మరీ ముఖ్యంగా రెండు మూడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటిస్తే ఆ రూమర్స్ మితిమీరిపోతుంటాయి. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుంటాయి. అయితే వీటిపై కొందరూ సెలబ్రెటీలు స్పందిస్తే.. మరికొందరు ఇండిస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజమే అంటూ సైలెంట్గా ఉండిపోతారు. అయితే దాదాపు పదేళ్ల నుండి టాలీవుడ్లో ఓ జంట రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేము …
Read More »సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు నిన్న శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్ …
Read More »నేడే తెలంగాణ మంత్రివర్గం భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఆదివారం సమావేశమవనుంది. ఈ సమావేశంలో భాగంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీకానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్పై మంత్రివర్గం చర్చించి, ఆమోదం తెలుపనున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు …
Read More »సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్బక్కమ్లోగల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన …
Read More »