తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్కు నేటి నుంచి గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్ పాయింట్కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్ రైలులో 11 మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నాయని …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి …
Read More »ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లోచ్చు..?
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీటీపీ) థర్డ్ జెనరేషన్ సాంకేతికతతో ‘క్విలిన్’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది. 2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. …
Read More »వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ
ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.యాంకర్గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …
Read More »కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?
ఒక పక్క అందం, మరోవైపు చక్కని అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్ భామ ‘ధోని-ది అన్టోల్డ్ స్టోరీ’, ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్ థ్రిల్లర్ ‘భూల్భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?
దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 …
Read More »ఇంగ్లండ్తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
ఇంగ్లండ్తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్గా తేలింది. శనివారం (జూన్ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …
Read More »కేక పెట్టిస్తున్న నిక్కి అందాలు
BJP పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారు
డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన …
Read More »అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
దేశంలో సాయుధ బలగాల్లో కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టే అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అగ్నివీరులకు పెన్షన్లు ఇవ్వకపోవడం పట్ల మోదీ సర్కార్ను ఆయన నిలదీశారు. స్వల్పకాలిక సర్వీసులో పనిచేసే అగ్నివీరులకు పెన్షన్ పొందే హక్కు లేనప్పుడు ఈ ప్రయోజనాలు ప్రజా ప్రతినిధులకు ఎందుకని ప్రశ్నించారు.దేశాన్ని కాపాడే సైనికులకు పెన్షన్ లేనప్పుడు తానూ పెన్షన్ వదులుకునేందుకు సిద్ధమని వరుణ్ గాంధీ …
Read More »