గుజరాత్ తీరంలోని పిపావావ్ పోర్టులో దాదాపు 90 కిలోగ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి ఆమ్రేలి జిల్లాలోని పిపావావ్ పోర్టుకు చేరుకున్న ఓ షిప్పింగ్ కంటెయినర్ నుంచి ఈ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రత్యేక పద్ధతి అవలంబించారని డీజీపీ అశిష్ భాటియా తెలిపారు. హెరాయిన్ ఉన్న ద్రావణంలో దారాలను నానబెట్టి, …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,75,864కు చేరాయి. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,23,803 మంది మృతిచెందారు. ఇంకా 18,684 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి.గత 24 …
Read More »పంట మార్పిడితో అధిక దిగుబడులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంటలను వేయాలని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …
Read More »తెలంగాణలో 24గంటల కరెంటు
తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే …
Read More »మన ఊరు- మన బడిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని …
Read More »మీకు జుట్టు రాలుతుందా..?
రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
Read More »అతిగా మద్యం తాగితే..?
పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
Read More »అఫ్రిదీపై డానీష్ కనేరియా సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానీష్ కనేరియా షాహిద్ అఫ్రిదీపై సంచలన ఆరోపణలు చేశాడు. ‘హిందువు అయినందుకు నేను జట్టులో ఉండటం అతడికి ఇష్టం ఉండేది కాదు. నన్నెప్పుడూ కించపరిచేవాడు. ఇతర టీమ్ సభ్యులను రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పేవాడు. నేను బాగా ఆడితే తట్టులేకపోయేవాడు. అతడొక క్యారెక్టర్ లేని వ్యక్తి’ అని కనేరియా మండిపడ్డాడు. వీరిద్దరూ కలిసి పాక్ జట్టు తరఫున ఆడారు.
Read More »డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు
KKR తో నిన్న గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై 22 ఇన్నింగ్స్ లో …
Read More »