తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్ల భాగంగా బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ …
Read More »దోమలు ఎవర్ని ఎకువగా కుడుతాయో తెలుసా..?
దోమలకు రాత్రివేళ కళ్లు బాగా కనిపిస్తాయి. దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్లకు అట్రాక్ట్ అవుతాయట. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్నవారిని ఎక్కువగా కుడతాయి. దోమలు 160 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గుర్తించి మనుషుల దగ్గరకు వస్తాయి. లావుగా, బరువు అధికంగా ఉన్నవారు, గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తారు. అందుకే వారినే దోమలు ఎక్కువగా …
Read More »మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త
మధుమేహంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాత బియ్యం, గోధుమలు, పాలిష్ తక్కువగా చేసిన బియ్యం, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. పాలు, పాలు పదార్థాలు, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. రాగి జావ, రొట్టె తింటే మంచిది.
Read More »బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?.. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం..! బ్రష్ చేయడానికి ముందు నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలంగా అవుతుంది. శరీరం హైడ్రేట్ అవుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపులో పుండ్లు, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం, జుట్టు మృదువుగా అవుతాయి.
Read More »RCB పై SRH ఘన విజయం
నిన్నశనివారం రాత్రి జరిగిన రెండో పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ …
Read More »బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు సవాల్
తెలంగాణకు రావాల్సిన రూ.7,183 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, దమ్ముంటే ఆ నిధులను తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లకు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఒక అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పి నిజమని చిత్రీకరించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం టీఆర్ఎ్సఎల్పీలో మీడియా సమావేశంలో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్లతో కలిసి ఆయన …
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
Read More »పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం
పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
Read More »అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ కి అరుదైన గౌరవం….
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ… ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తూ… ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్న అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ కి అరుదైన గుర్తింపు లభించింది. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేద ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను జాతీయ సేవా పురస్కారం వరించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఎంతో మంది నిరుపేద ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా అనేక …
Read More »మలేరియా కేసుల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల నియంత్రణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి జాతీయ గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ పంపింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె, …
Read More »