దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,598 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,22,70,482 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,13,481 …
Read More »Apలో సీఎం కేసీఆర్ కు ఫ్లేక్సీలు
జనసేన నాయకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయన ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని పవన్ అభిమానులు విజయవాడలో ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలో పవన్ కల్యాణ్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఫోటోలను కూడా ప్రదర్శించారు. భీమ్లా నాయక్ సినిమా …
Read More »తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీ
తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీని వినియోగించుకొంటున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారని తాజాగా విడుదల చేసిన స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్-2022 వెల్లడించింది.ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. 2020-21లో 1.07 లక్షల మంది ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరున్నర నెలల్లో 75 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకొన్నారు. రాష్ట్రంలో మొత్తం 77 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉన్నారు. …
Read More »సిరిసిల్లలో రూ.60కోట్లతో టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ
తెలంగాణలో సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్పోర్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నది. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టెక్స్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు …
Read More »భీమ్లా నాయక్ పై చంద్రబాబు సంచలన ట్వీట్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో ఏపీ అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ… రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా …
Read More »ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి-ఖర్చులను మేము భరిస్తాం -మంత్రి కేటీఆర్
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.ఉక్రెయిన్లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, …
Read More »దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో 13,166 మందికి కరోనా అని తేలింది.26,988 మంది కోలుకున్నారు. 302 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు చేరింది. యాక్టివ్ కేసులు 1,34,235 ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 32,04,426 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
Read More »రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?
అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో …
Read More »విటమిన్”ఇ” తో అందంగా ఉండోచ్చా..?
విటమిన్”ఇ”లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖానికి కావాల్సిన తేమ అందిస్తుంది. చుండ్రు, దురద, జుట్టు త్వరగా పెరగకపోవడం వీటన్నింటికి “ఇ” విటమిన్తో చెక్ పెట్టొచ్చు. రెండు క్యాప్సూళ్ల విటమిన్ “ఇ” నూనెను.. తలకు రాసే నూనెకు కలిపి, రాత్రి లేదా తల స్నానానికి అరగంట ముందు పట్టిస్తే ఫలితం ఉంటుంది. నిర్జీవంగా మారిన చేతి గోళ్లకు “ఇ” విటమిన్ నూనెతో మర్దన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్.. అందులో చర్చించాల్సిన అంశాలపై ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
Read More »