ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్ఎఫ్ నిర్ణయించింది. దీనికోసం కంపెనీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మెన్ గురువారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావుతో సమావేశమై కంపెనీ విస్తరణపై చర్చించారు.పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ఎంఆర్ఎఫ్ …
Read More »సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ట్రోఫీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ట్రోఫీలో హీరో అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ట్రోఫీలో 258 జట్లు, 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. …
Read More »దేశానికి కొత్త అభివృద్ధి నమూన ‘కేసీఆర్’
పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశవ్యాపితంగా చర్చ జరుగుతుందని, ఆయన ఆలోచనల ధారల్లో దేశానికే నూతన ప్రణాళిక రచించుకునే సమయం అసన్నమైందని అన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన “కేసీఆర్ ది మ్యాన్ ఆఫ్ …
Read More »గుండెకు మేలు చేసే ఆహారం ఏంటో తెలుసా..?.
గుండెకు మేలు చేసే ఆహారం ఏంటో తెలుసా..?..తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకోండి 1. రోజూ పెరుగు తినడం వల్ల గుండెపోటు అదుపులో ఉంటుంది. 2. అక్రోట్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గుతాయి. దీని వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. 3. సముద్ర చేపలు తినాలి. ఇందులో ఒమేగా కొవ్వులతో పాటు గుండెకు మేలు చేసే మెగ్నీషియం,పొటాషియం ఉంటాయి. 4. పాలకూర తింటే గుండె మీద ఒత్తిడి …
Read More »మరోకసారి వార్తల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
చిత్రవిచిత్ర నిర్ణయాలు, శిక్షలతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలీలను నియమించగా.. వాతావరణ మార్పుల వల్ల ఈఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు.దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3, మరొకరికి 6 నెలల జైలుశిక్ష విధించారు.
Read More »దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు
గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 30,615 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,70,240 యాక్టివ్ పాజిటివిటీ రేటు 2.45%గా ఉంది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. నిన్న 27,409 కేసులు నమోదయ్యాయి.
Read More »మానసిక ఆరోగ్యం కోసం ఏమి చేయాలంటే..?
మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. ఎలా ఉంటుందో మీరే చూడండి.. > తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. >క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయండి. >నచ్చిన సంగీతం వినండి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. >వీలైతే నచ్చిన వంటలు చేసుకోండి. పాకశాస్త్రంలో కొత్త వంటల కోసం ప్రయోగాలు చేయండి. >ఇష్టమైన వ్యక్తులతో ఆడియో లేదా వీడియో కాల్లో మాట్లాడండి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని …
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తా
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భారం మోపే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఛార్జీల పేరుతో అదనపు బిల్లులను ప్రజల నుంచి వసూలు చేస్తోందని విమర్శించారు. విద్యుత్ వినియోగదారులకు డెవలప్మెంట్ ఛార్జీల భారం కేసీఆర్ పుట్టినరోజు కానుకనా? అని ప్రశ్నించారు. డెవలప్మెంట్ ఛార్జీల భారం ఎత్తేస్తే రేపు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని తెలిపారు.
Read More »తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు శాఖలో ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా.. మిగిలిన శాఖలతో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. ఈ శాఖలో దాదాపు 16వేల కానిస్టేబుల్, వెయ్యి ఎస్సై పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
Read More »రాజ్యసభ సీటుపై ఆలీ క్లారిటీ
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేత,ప్రముఖ నటుడు అలీ కుటుంబ సమేతంగా ని సీఎం ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎంతో జరిగిన భేటీ వివరాలను అలీ వెల్లడించారు. ‘మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎంను కలిశా. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. సమయం లేక నేనే వద్దని చెప్పా. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. పదవి ఇస్తేనే పార్టీలో సేవ చేస్తానని …
Read More »