‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 767 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,749 కరోనా టెస్టులు చేయగా 767 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 7,81,603కు చేరాయి. ఇప్పటివరకు 4,105 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 2,861 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 58,077 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనాతో 657 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,07,177కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,97,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 15,11,321 కరోనా టెస్టులు చేశారు.
Read More »మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని …
Read More »మరోసారి తన మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్
నిరుపేద కుటుంబంలో జన్మించి, తండ్రి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న ఓ యువతికి అరుదైన గౌరవం లభించింది. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కేటీఆర్ ఆ యువతిని ప్రగతి భవన్కు పిలిపించి సత్కరించారు. ఆమె కోరినట్లు డబుల్ బెడ్రూం ఇంటి పత్రాలను, ఆటోను అందజేశారు. సబిత ఆలోచనా విధానం, మాట తీరు తనను ఎంతో ఆకర్షించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సబిత ఉన్నత చదువులకు తప్పకుండా సహాయం చేస్తానని కేటీఆర్ …
Read More »అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్తో పాటు పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »లక్షలాది మందితో ఢిల్లీలో ధర్నా చేస్తాం
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే …
Read More »ప్రభాస్ కోసం తెగ ట్రై చేస్తున్న F2 భామ
Pan India Hero ..యంగ్ రెబల్ స్టార్ .స్టార్ హీరో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కోసం యంగ్ హీరోయిన్ మెహ్రీన్ గట్టిగానే ట్రై చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరుసగా క్రేజి ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్న ప్రభాస్ ..దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫైనల్ చేసినట్టు సమాచారం. …
Read More »సీఎం కేసీఆర్ కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమౌతున్న సందర్భంగా..జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు మంగళవారం ప్రగతి భవన్ లో అందజేస్తున్న మంత్రులు., గిరిజన,మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా, ఎండోమెంట్స్ …
Read More »ప్రధాని మోదీపై మంత్రి హారీష్ రావు ప్రశ్నల వర్షం ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకున్నారు. కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాయి. అయినప్పటికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదెక్కడి రాజ్యాంగ విధానం మోదీ? అని నిలదీశారు.పాలక, …
Read More »