ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శుక్రవారం ఎన్జీటీ తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్పై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే …
Read More »ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అవార్డు ప్రకటనపై ఫేస్బుక్లో ఓ ప్రకటన చేసింది. …
Read More »ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ
ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. పోటీల నిర్వాహకులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోటీదారులంతా మిస్ వరల్డ్ ఫినాలే జరుగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేషన్లో ఉన్నారు. కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ …
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడించారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్ను …
Read More »లంచాలు తీసుకుని ఇండ్లిస్తామంటే నమ్మొద్దు- మంత్రి కేటీఆర్…
లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూనగర్లో నూతనంగా నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. …
Read More »తెలంగాణకు మరో భారీ పెట్టుబడి
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.బలమైన మార్కెట్, వ్యాపారాభివృద్ధికున్న విస్తృత అవకాశాలతో మార్స్ పెట్కేర్ ఇండియా రూ.500 కోట్లతో ప్లాంట్ విస్తరణకు ముందుక్చొంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు.. వేగంగా ఇస్తున్న అనుమతులు.. పారిశ్రామిక విస్తరణకు దోహదం చేస్తున్నాయి. సమర్థవంతమైన అధికార యంత్రాంగం కృషీ కలిసొస్తున్నది. పెంపుడు జంతువుల ఆహార కంపెనీ మార్స్ పెట్కేర్ ఇండియా సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లోని …
Read More »తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లు నియామకం
తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా దూదిమెట్ల బాలరాజు యాదవ్లను నియమించారు. సీఎం …
Read More »జీహెచ్ఎంసీ అప్రమత్తం-GHMC సర్కిళ్లలో ఐసొలేషన్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే కాలనీల వారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతూ మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అంతేకాకుండా 2173 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రసాయనాలు స్ప్రే చేశారు. పాజిటివ్ నమోదవుతున్న ప్రాంతాలు, …
Read More »హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. చాచా నెహ్రూనగర్లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 …
Read More »తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు
తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేశారు. శాసనసభలో అక్టోబర్ ఒకటిన సీఎం కేసీఆర్ హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈ మేరకు దీనిపై ఉత్తర్వులు …
Read More »