Home / rameshbabu (page 545)

rameshbabu

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన బిల్ గేట్స్‌

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్పుడు ముగుస్తుందో అంచ‌నా వేశారు బిల్ గేట్స్‌. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిలియ‌నీర్‌ త‌న బ్లాగ్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు. 2022లో కోవిడ్ మ‌హ‌మ్మారికి చెందిన తీవ్ర ద‌శ ముగుస్తుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ఆందోళ‌న ప‌రిస్థితి త‌ప్ప‌ద‌న్నారు. ఈ ద‌శ‌లో మ‌రో సంక్షోభాన్ని అంచ‌నా వేయ‌లేమ‌ని, కానీ మ‌హ‌మ్మారికి చెందిన తీవ్ర ద‌శ వ‌చ్చే ఏడాది ముగియ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. గేట్స్ …

Read More »

మరోసారి ఆ దర్శకుడితో మెహ్రీన్

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ మరోసారి నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం రూపొందుతున్న ‘ఎఫ్ 3’ మూవీలోనూ మెహ్రీన్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూడు …

Read More »

ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఇతనే బయటపడ్డాడు..?

ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. వరుణ్‌ మంచి ధైర్యశాలి. వాయుసేనలో విశేష సేవలందించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌కు ఆయనే కెప్టెన్‌. గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనపుడు ఆయన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గతేడాది …

Read More »

బిపిన్ రావ‌త్‌కు రేపు సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌కు రేపు సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆయ‌న భౌతిక‌కాయాన్ని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నారు. త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో ఉన్న కూనూరు వ‌ద్ద హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో 13 మంది మృతిచెందారు. దాంట్లో బిపిన్ రావ‌త్ స‌తీమ‌ణి మ‌ధులిక కూడా ఉన్నారు. అయితే కోయంబ‌త్తూరు నుంచి వాయుసేన ప్ర‌త్యేక విమానంలో బిపిన్ రావ‌త్ పార్దీవ‌దేహాన్ని త‌ర‌లించ‌నున్నారు. …

Read More »

ఆర్మీ హెలికాప్టర్ [ప్రమాదంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యం

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌కు తరలించారు. వింగ్‌ కమాండర్‌ ఆర్‌ భరద్వాజ్‌ నేతృత్వంలోని …

Read More »

సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్

తెలంగాణలో సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను  కేంద్రం వేలం జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. 

Read More »

సీరియల్ నటి లహరి కారు బీభత్సం

సీరియల్ నటి లహరి కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో లహరి వాగ్వాదానికి దిగింది. తన భర్త వచ్చి మాట్లాడతారంటూ కారులోనే ఉండిపోయింది. గాయపడిన వ్యక్తికి ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం …

Read More »

147 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జ‌ట్టు కేవ‌లం 147 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్పీడ్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ తొలి బంతికే.. రోరీ బ‌ర్న్స్ క్లీన్ బౌల్డ‌య్యాడు. …

Read More »

వ్యాక్సినేషన్‌ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం

తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పూర్తికి ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకాయే మార్గమని చెప్పారు. అందువల్ల ప్రజాప్రతినిథులు తమ పరిధిలో ఉన్న ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ అందేలా చూడాలని సూచించారు. నగరంలోని కొండాపూర్‌ ఉన్న ప్రభుత్వ దవాఖానలో ఆధునిక వసతులను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అదనపు పడకల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు. …

Read More »

సూసైడ్‌ మెషీన్‌ వచ్చేసిందిగా..?

కోరుకున్న సమయానికి.. ఎలాంటి బాధలేకుండా రెప్పపాటులో చావు వస్తే.. అంతకంటే అదృష్టం ఉంటుందా?’ తరుచూ ఈ మాటలు వినే ఉంటాం. నొప్పితెలియని, అనాయాస చావును ప్రసాదించాలని కోరుకునే వారూ కోకొల్లలు. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. నొప్పిలేని మరణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ‘సూసైడ్‌ మెషీన్‌’కు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఏమిటీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat