బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై రైతుల రుణమాఫీపై చర్చించింది. ఈ నెల 15వ తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు కల్లా పూర్తిచేయాలని వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో దాదాపు ఆరు లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 …
Read More »ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్ను రాజ్భవన్కు పంపింది. గవర్నర్ ఆమోదం తెలిపాక కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్ సమక్షంలో …
Read More »అందాలతో మత్తెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్
మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తొలి చిత్రం ప్రగ్యాకి పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టలేదు. వరుణ్ తేజ్ కంచె సినిమాతో అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా తర్వాత ప్రగ్యాకి ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. కాని ఏ సినిమా విజయం సాధించకపోవడంతో సైలైంట్ అయింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా …
Read More »ఈ నెల 16 నుంచి దళితబంధు అమలు
దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ప్రైజ్’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు …
Read More »అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ
సోషల్ మీడియా ఆదరణ పెరిగాక నెటిజన్స్ కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంకర్స్, నటీమణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శర్మ సెక్సీ లుక్లో కనిపించి నెటిజన్స్ మతులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ …
Read More »దేశంలో కొత్తగా 41వేలకుపైగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది.ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులున్నాయని …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల …
Read More »వెనక్కి తగ్గిన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయుదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో …
Read More »తెలంగాణలో ఏడేండ్లలో..15,000 పరిశ్రమలు
తెలంగాణ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉండటంతో ఆర్థికాభివృద్ధి శరవేగంగా సాగుతున్నదని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఏడేండ్లుగా పల్లెలు, పట్టణాలు సమతుల అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల అనుకూల విధానాల వల్ల 15 వేల పరిశ్రమలకు పైగా రాష్ర్టానికి వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ సమానస్థాయిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమర్థ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం ఉన్నందు వల్లనే ఇది …
Read More »