తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా.ఇప్పటికే ఎన్నో భారీ ప్రభుత్వ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన మోదీ ప్రభుత్వం.. పేదోడి జీవనాడి అయిన రైల్వేను ప్రైవేటుపరం చేసేందుకు రైలంత వేగంతో పరుగెడుతున్నది. అధిక లాభాలార్జిస్తున్న అనేక మార్గాల్లో ప్రైవేటుకు తలుపులు తెరిచిన కేంద్రం, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే …
Read More »ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.
Read More »ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 240 అధ్యాపక, వర్సిటీల్లో 25 వేల సహాయ ఆచార్యుల, 157 బ్యాక్ గ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బ్యాక్ గ్ ఖాళీల్లో 92 SC, 65 ST కేటగిరికి చెందినవి అని.. వీటికి జూలైలో నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే ఏడాది జనవరిలో డిగ్రీ అధ్యాపకుల నియామకాలకు, ఫిబ్రవరిలో సహాయ ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ …
Read More »విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …
Read More »టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి కాంబినేషన్లో మూవీ రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్, రామ్ చరణికి ఒక కథని చెప్పాడట. ఆ కథకి చరణ్ అంతగా ఇంప్రెస్ కాకపోవడంతో, కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడట. ఆ కథ విజయ్క బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
Read More »133.89 కోట్లకు చేరిన దేశ జనాభా
తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది. దీని ప్రకారం నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. మరోవైపు, తెలంగాణ జనాభా 3.72 కోట్లు, …
Read More »ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో
ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ …
Read More »వన్డే క్రికెట్ కి ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ రిటైర్మెంట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ (37) వన్డే క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్నాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేశాడు. 114 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ను ఎత్తివేసి …
Read More »మంత్రి కేటీఆర్ చొరవతో చిన్నారి అక్షయ సర్జరీ పూర్తి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత లేకపోవడంతో విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సర్జరీకి హామీ ఇచ్చారు. పాప ఫోటో చూస్తూనే చాలా బాధపడ్డట్లు తెలిపారు. ఎలా భరిస్తుందో ఆ చిన్నారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. …
Read More »