ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.
Read More »జాజికాయతో లాభాలెన్నో..?
జాజికాయలో ఆరోగ్య సుగుణాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జాజికాయ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది. వేడి పాలలో తేనె, యాలకుల పొడి, జాజికాయ పొడి కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. జాజికాయలోని ఆయిల్స్ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. దీన్ని తింటే జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. జాజికాయ ఆయిల్ పంటి నొప్పిని తగ్గిస్తుంది. దీని కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది. …
Read More »థర్డ్ వేవ్ భయాంకరంగా ఉండబోతుందా..?
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే.. థర్డ్వేవ్ భయాలు వణికిస్తున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా అక్కడ చిన్నారులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. మార్చి-మే నెలలను పోలిస్తే.. చిన్నారుల్లో 145% అధికంగా.. టీనేజ్ పిల్లల్లో 160% 3 3 అధికంగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2నెలల్లో ఇప్పటికే 15,000పైగా చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు.
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త
టాలీవుడ్ స్టార్ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హరీశ్ శంకర్, పవన్ సినిమాకు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో పవన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. ఇందులో ఐబీ ఆఫీసర్గా, లెక్చరర్గా పవన్ నటించనున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో రానున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 25 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,47,727 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,085మంది మరణించారు. కొత్తగా 4,801 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,00,247కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్ పాయింట్లు సాధించారు. రెగ్యులర్ సహా గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే …
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,44,263గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3060 మంది చనిపోయారు. జిల్లాల వారీగా …
Read More »సెల్యూట్ పోలీస్
కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్మార్కెట్కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్మార్కెటింగ్కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్మార్కెటింగ్పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్ …
Read More »