ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశ వైద్య రంగంలో …
Read More »“ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 83వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సుమిత్ర నగర్, గుడెన్మెట్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. కాగా గడిచిన ఏళ్లలో కాలనీల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు …
Read More »పలు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్ కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్ , నారాయణ్ పేట్ జిల్లా , మద్దూర్ మండలం రెనెవట్ల కు చెందిన మొహమ్మద్ సలీం లను నియమించారు. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లి కి …
Read More »రంగనాయకసాగర్కు తరలుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు
కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యంగా దిగువ నుంచి ఎగువకు గలగలా పారుతున్నది. బుధవారం కూడా వరద కాలువకు కాళేశ్వరం జలాలు వడివడి చేరుతున్నాయి. ప్రస్తుతం ఆ కాలువ నిండుకుండలా మారుతున్నది. లక్ష్మీ పంప్హౌస్ నుంచి సరస్వతీ, పార్వతీ పంప్హౌస్ బరాజ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి టన్నెల్స్ ద్వారా నందిమేడారం, గాయ త్రి పంప్హౌస్లకు అక్కడి …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్
కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ నరోత్తంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి నరోత్తం రెండుసార్లు టీడీపీ తరఫున …
Read More »చుక్కలను తాకుతున్న టమాట ధరలు
దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు పలు నగరాల్లో రూ.160 పలుకుతున్నది. ఇక ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో అత్యధికంగా కేజీకి రూ.162గా ఉంది. ఇక హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్లో టమాట ధర గురించి చెబితే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. ఉత్తరాఖండ్లోని గంగోత్రి ధామ్లో కిలో టమాట …
Read More »గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ
దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ పొడు పట్టాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని బుగ్గపాడు, చెరుకుపల్లి, కాకర్లపల్లి, రేగళ్ళపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన 1,196 మంది రైతులకు 1,649 ఎకరాలకు పోడు పట్టాలను గిరిజనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య …
Read More »ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు
ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలుత సత్య కుమార్ పేరు వినిపించగా.. కాంగ్రెస్లో కీలక బాధ్యతలు, కేంద్రమంత్రిగా పురందేశ్వరికి ఉన్న అనుభవం, ఎన్టీఆర్ వారసురాలు అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న కాషాయం పార్టీ.. చిన్నమ్మకు కొత్త బాధ్యతలు అప్పగించింది.
Read More »వర్షాలు రాకున్నా.. కాళేశ్వరం ధైర్యంతో రైతులు నారు పోశారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం జిల్లాలోని శ్రీ కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయ క్యూ-లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. అంతకుముందు మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో మంత్రి …
Read More »విడాకులకు సిద్ధమైన నిహారిక జంట
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు..ప్రముఖ సినీ నిర్మాత ..సీనియర్ నటుడు నాగబాబు కూతురైన నిహారిక, చైతన్య దంపతులు విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా మూడేండ్ల కిందట అంటే 2020లో నిహారిక, చైతన్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. తాజాగా వీళ్లు మ్యూచువల్ అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు మే 19న కూకట్ పల్లి ఫ్యామిలీ …
Read More »