టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …
Read More »వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు
మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. …
Read More »క్రికెటర్ కు నిర్మాతగా మారిన బల్లాలదేవ..?
రానా దగ్గుబాటి..ఇతడి పేరు వింటే ఎవరికైనా గుర్తొచ్చేది బల్లాలదేవ. బాహుబలి సినిమాతో అంతటి ఫేమ్ తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో ఒక భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో రానుంది. అయితే విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. దీనికి గాను రానా నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి భారీ …
Read More »తెలంగాణలో అద్భుత జల దృశ్యం… సంద్రంలా.. సుందిల్ల…!
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మంథని మండలం సిరిపురంలో నిర్మించిన సుందిల్ల బరాజ్ సంద్రాన్ని తలపిస్తున్నది. కాసిపేటలోని అన్నారం పంపుహౌస్లో నాలుగు మోటర్లు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తుండడంతో సోమవారం సాయంత్రానికి బరాజ్లో నీటినిల్వ 5.82 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన మేడిగడ్డ బరాజ్లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 4.584 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్లో 7.77 టీఎంసీలుగా నమోదైంది. సుందిల్ల బరాజ్ బ్యాక్వాటర్ గోలివాడ పంప్హౌస్కు …
Read More »గోదావరిఖనిలో కాళేశ్వరం జలజాతర ..జనసంద్రమైన జలజాతర
డబ్బు ఖర్చుపెట్టకుండా ఏదైనా జరుగుతుందా.. వంద రూపాయల ప్రయోజనం కలగాలంటే పది రూపాయలయినా ఖర్చుపెట్టొద్దా.. కుండల అన్నం కుండలే ఉంటే పిల్లాడు ఎట్ల పెరుగుతడు.. కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నరు అని సంక్షేమశాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో నిర్వహించిన కాళేశ్వరం జలజాతర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి తెలంగాణను …
Read More »లోక్ సభలో కేంద్రానికి వ్యతిరేకంగా విజయసాయి ప్రసంగం.. మరోసారి దేశమంతా వైసీపీ గురించి చర్చ.. ఆయన ఏం మాట్లాడారంటే
ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం నాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో ప్రకటించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం నాడు జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముస్లిం వివాహం …
Read More »బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట నైజాం, ఒవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్న నో బారియర్స్ ఎంటర్టైన్మెంట్స్
హ్రుదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో , కాలేయం లో తన స్థానాన్ని టెంట్ వేసుకుని పడుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో హ్రుదయకాలేయం సృష్టికర్త స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనం, మాటలతో కొబ్బరిమట్ట అనే చిత్రాన్ని తీయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన రూపక్ రొనాల్డ్ సన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సున్నితమైన కథలతో చిత్రాలు నిర్మించి ప్రేక్షకులకి గిల్లికజ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాతగా …
Read More »త్రిపాత్రాభినయం, కామెడీ, భారీ డైలాగులతో మరోసారి ప్రేక్షకుల హృదయ కాలేయాలను దోచుకుంటాడా.?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కామెడీ చూసి చాలా కాలం అవుతోంది. కాస్త గ్యాప్ తర్వాత కొబ్బరిమట్ట సినిమాతో సంపూ వెండితెరపైకి వస్తున్నారు. సంపూకోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ గత ఏడాదినుంచి వాయిదా పడుతోంది. గతంలో ఓసారి దాదాపుగా సినిమా రిలీజ్ ఆగిపోయినట్లేననే రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా కొబ్బరిమట్ట రిలీజ్ కు సిద్ధమైంది. హృదయకాలేయం దర్శకుడు రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు …
Read More »మరోసారి తన మంచితనాన్ని చాటుకున్న ఆర్కే..!
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పోలీసు సిబ్బందికి తనదైన శైలిలో సహాయం అందించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు.నిత్యం ఓ వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, అరటి పండు, మజ్జిగ ప్యాకెట్ లను అందజేశారు.ఇలా తమ శ్రమను గుర్తించి తనదైన శైలిలో సహాయం చేసే దాతృత్వం చూపించిన ఎమ్మెల్యే ఆర్కే కు సదరు సిబ్బంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల భాదలు తెలుసుకుని వాటిలో …
Read More »కచ్చితంగా పవన్ బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలే కనిపిస్తున్నాయా.? పవన్ వ్యాఖ్యలపై ఆంతర్యం
ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా విజయవాడలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని తమను కోరుతున్నాయని.. ఎవరితో కలిసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలను కాపాడటంకోసం ఏర్పాటుచేసిన జనసేన పార్టీని మరే ఇతర పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. …
Read More »