ఏపీ అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేకమంది వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …
Read More »Blog List Layout
పవన్ కల్యాణ్ యాత్రలో అపశృతి.. ఓ అభిమాని ..యస్ఐ కాళ్లు విరిగి..లాఠీ ఛార్జ్
జనసేన అధినేత జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ యస్ఐ చిరంజీవి కాలుపైకి ఏక్కిన సినీహీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారు…కొత్తగూడెం నుండి ర్యాలీ గా ఖమ్మం వస్తుండగా స్థానిక గోపాలపురం వద్ద యస్ఐ చిరంజీవి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండగా ఎడమ కాలుపైకి ఎక్కడం తో మడమ విరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు …
Read More »నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో సంచలనం ..
వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు .అయితే కల్సింది మాములు కార్యకర్త కాదు ఏకంగా టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి .కౌన్సిలర్ …
Read More »అలా చేస్తే కాంగ్రెస్కు సపోర్ట్… పవన్ తిక్క వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజకీయ యాత్ర తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదు.. భజన సేన అని వీహెచ్ విమర్శించారు. అయితే హనుమంతరావు వ్యాఖ్యల పై పవన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …
Read More »జగన్ పార్టీకి చాన్సే లేదట.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!
పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని.. టీడీపీ నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …
Read More »వీడియో : రైలు ముందు పోజిచ్చాడు..ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.హైదరాబాద్ లోని భరత్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఎంఎంటీఎస్ రైలు వస్తున్న సమయంలోసేల్ఫీ తీసుకుంటూ శివ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడి తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. బాధితుడు లింగంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. …
Read More »పవన్ పై చెప్పుతో దాడి.. ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. అయితే ఈ యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి పవన్ పై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. బుధవారం తెలంగాణలోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్యక్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇక ఆ జన …
Read More »గుంటూరు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి అమ్మాయిలను రప్పించి
ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. తాజాగా పట్టణంలోని బాలాజీనగర్లోని శ్రీనివాసనగర్ రెవెన్యూ వార్డులో గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని షీ..టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానగర్కు చెందిన లక్ష్మి, వీకర్సెక్షన్ కాలనీకి చెందిన మండ్ల మధుసూదన్రావు, శరీన్నగర్కు చెందిన మన్నెపోగు ప్రవీణ్కుమార్, రామచంద్రానగర్కు చెందిన మంగలి ఉపేంద్ర, విశాఖపట్టణానికి చెందిన పోలవరం భవాని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా కర్నూలు నగరంలో …
Read More »బ్రేకింగ్-న్యూస్ 2019 ఎన్నికల్లో వైసీపీ పక్కా గెలుస్తుందని..ముస్లీం జ్యోతిష్యుడు సవాలు…!
విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడడంతో వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై సర్వేలు వస్తున్నాయి. …
Read More »దళితుల కోసం వైఎస్ జగన్ సంచలనాత్మక నిర్ణయం..!!
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గతంలో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాఖ్యలు ప్రతి దళితుడుని బాధించడమే కాకుండా.. చంద్రబాబుపై విమర్శలను ఎక్కుపెట్టారు. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలపై మరింత లోతుగా విశ్లేషించేందుకు చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో.. దళితుల సంక్షేమం కోసం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర …
Read More »