ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగింస్తూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ …
Read More »మలక్పేటలో నేడు 288 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..
మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అంతస్తుల్లో రూ. 24.91 కోట్ల వ్యయంతో నిర్మించారు. హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో మురికివాడగా ఉన్న పిల్లిగుడిసెలు బస్తీలో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …
Read More »పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి
పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …
Read More »సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సభ్యులందరూ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా …
Read More »రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించనున్నారు. డబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి చాదర్ఘాట్ వరకు ఊరేగింపు కొనసాగనుంది. ఈ సమయంలో ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Read More »సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులు
సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకుంటారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, పంద్రాగస్టు వేడుకల కోసం గోల్కొండ కోట సర్వాంగ …
Read More »ప్రగతి భవన్లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
ప్రగతి భవన్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »GHMC మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. రాజ్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ …
Read More »మూసీ నదికి కొత్త వన్నె
ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా ముస్తాబైంది. నాగోల్ పరిధిలో మూసీ నదిని రమణీయంగా తీర్చిదిద్దారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, పాకలను రూపొందించారు. 100 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పంద్రాగస్టు రోజున ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ …
Read More »జంటనగరాల్లో వైభవంగా బోనాల వేడుకలు
జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తున్నది. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్ ఉధృతి కాస్త …
Read More »