ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు.
Read More »గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. గవర్నర్ను సీఎం కేసీఆర్ కలిసి బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ …
Read More »మార్చి 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
మార్చి 6, 2020 నుండి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు మరియు పోలీసు శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర …
Read More »సాగర్ ఎడమకాల్వకు పునర్జీవం
తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ పునర్జీవానికి తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం (ట్రీ) రూ.1700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. దాదాపు 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత నీటి భరోసా కల్పించేలా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి ట్రీ సమర్పించింది. సీతారామ ఎత్తిపోతల పథకంలోని ప్రధానకాల్వను ఆధారం చేసుకొని ఈ పునర్జీవ పథకానికి రూపకల్పనచేసిన దరిమిలా తక్కువ ఖర్చుతోనే బహుళ ప్రయోజనాలు పొందవచ్చని నివేదికలో ట్రీ పేర్కొన్నది. ఈ పథకంతో మున్నేరు జలాల్ని …
Read More »కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రూ.100 కోట్లు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కొవిడ్-19 వైరస్ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమయిందని.. వైరస్ వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారని.. కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరుచేశారని వివరించారు. కరోనావైరస్పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనిని ఎదుర్కొనేందుకు …
Read More »రేవంత్ జైలుకెళ్ళడం ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూము లు కబ్జాచేసిన కాం గ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఇంచార్జి మేడి పాపయ్య మాది గ ధ్వజమెత్తారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించిన రేవంత్రెడ్డిని వెంటనే అరెస్టుచేసి, భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లను ఆక్రమించి గేట్లు పెట్టుకోవడమే …
Read More »లక్ష్మి పంప్హౌజ్లో ఎత్తిపోతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా దిశను మార్చుకొని ఎదురెక్కుతూ వందల కిలోమీటర్లమేర పాలకడలిలా గోదావరి నది విస్తరిస్తున్నది. ఇక్కడి లింక్ -1,2లో మోటర్లు దిగ్విజయంగా నడుస్తుండగా, గోదావరి అజేయంగా రైతన్న బీళ్లకు పరుగులు తీస్తున్నది. దిగువన భూపాలపల్లి జిల్లాలో లక్ష్మి పంప్హౌజ్లో ఎత్తిపోతలు కొనసాగుతుంది. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనూ పంపులు నిర్విరామంగా నడుస్తున్నాయి. మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్హౌజ్లో మంగళవారం …
Read More »ఢిల్లీలో 15మందికి కరోనా వైరస్..?
ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో పాజీటీవ్ అని …
Read More »మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?
మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు. ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు. త్వరగా …
Read More »కరోనా ఎఫెక్ట్ -మాస్క్ లు అందరూ ధరించాలా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు. ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు …
Read More »