ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకుని విజయనగరానికి చేరింది. కాగా నిన్న (సోమవారం) వైఎస్ జగన్ ఎస్కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) 270వ రోజు ప్రజాసంకల్పయాత్రను ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని కొత్త వలస లోని తుమ్మికపాలెం నుండి వైఎస్ జగన్ ప్రారంభించారు. అక్కడ పార్టీ …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రతో విజయనగరమే జగన్ విజయానికి నాంది..ఎమెల్యే పుష్పా శ్రీవాణి !
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అక్కడ రావి చెట్టు మొక్కను జగన్ నాటారు. గత ఎడాది (2017 )నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర నేటితో 269 రోజులకు …
Read More »డుంబ్రిగూడ ఎస్ఐ అమర్నాథ్ సస్పెన్షన్….
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని, దాడి 12 గంటలకు జరిగితే, సాయంత్రం వరకూ ఘటనాస్థలికి చేరుకోలేదనే ఆగ్రహంతో స్థానికులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. ఈ దాడి డుంబ్రిగూడ ఎస్ఐ అమర్నాథ్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో వారు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ కు నిప్పంటించి, ఫర్నీచర్ ధ్వంసం చేసి, పొలీస్ …
Read More »జననేత జగన్ 269వ రోజు ప్రజాసంకల్పయాత్ర….
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటితో11 జిల్లాలు పూర్తి చేసుకొని 12వ జిల్లా విజయనగరం లోకి ప్రవేశించింది. విశాఖ జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ సోమవారం విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకున్నారు. జగన్ అక్కడికి చేరుకోగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు వేలాదిగా తరలి రావడంతో చింతలపాలెం గ్రామం జనసద్రమైంది. చింతలపాలెంలో …
Read More »ఏపీలో 3వేల మంది గిరిజనులు పోలీస్ స్టేషన్లపై దాడి…హై అలర్ట్
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు.పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డుంబ్రి గూడ పోలీసుస్టేషన్కు నిప్పంటించారు.ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. డుబ్రీగుంట పోలీస్ స్టేషన్ …
Read More »జర్నలిస్టులకు వరాల జల్లు…. జననేత జగన్
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర లో జగన్ ని చూడటానికి తమ బాధలను సమస్యలను తెలియజేయడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ పాదయాత్ర లో జగన్ ప్రతి ఒక్కరి సమస్య వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు …
Read More »బిక్ష కాదు .. దీక్షా ఫలం
అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది.ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, ఆస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వమే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు. …
Read More »తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్….ఎమ్మెల్యేలు,ఎంపీలు జాగ్రత్త
విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్య నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ఇదే ఘటనలో మాజీ ఎమ్మెల్యే శివేరి సోమని కూడా మావోయిస్టులు మట్టుబెట్టడంతో రెండు రాష్ట్రాల్లో పోలీసులు ఒక్కసారిగా అప్రమప్తమయ్యారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన మైనింగ్ క్వారీ వద్దకు వెళుతుండగా డుంబ్రీగూడా మండలం లిప్పిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ డీఐజీ..
మాజీ డీఐజీ ఏసురత్నం ఆదివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు (ఆదివారం) ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం కలిశారు. అనంతరం మాజీ డీఐజీ ఏసురత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఏసురత్నానికి కండువా కప్పి …
Read More »వైఎస్ జగన్ 268వ రోజు ప్రజాసంకల్పయాత్ర….
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతూ నేడు 268వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలంతా జగన్ తో పాటు అడుగులు వేస్తున్నారు. జననేత అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు …
Read More »