భారత్లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్షా జఫర్ మార్గ్లో జరిగిన రుయత్ ఏ హిలాల్, ఇమారత్ ఏ షరియా-హింద్ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్ ఉలేమా ఏ హింద్ ప్రకటించింది. కాగా, ప్రపంచంలో అత్యధిక …
Read More »పంజాబీ డ్రస్ లో అదిరిపోయిన నివేదా పేతురాజ్
రావినూతలకు చేరుకున్న సీఎం కేసీఆర్
వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
Read More »రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది.మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన …
Read More »చింతల్ డివిజన్ చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 29వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర చేస్తూ దాదాపు పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర పనులు పరిశీలించారు. కాగా చంద్రానగర్ లో రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ …
Read More »పేదలకు కొండంత అండ కళ్యాణలక్ష్మీ పథకం – ఎమ్మెల్యే చల్లా…
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఒకరికి , గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15వ …
Read More »వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించనున్నారు. అదే విధంగా చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. భారీ వర్షాలు కురిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాల …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ లో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడుతూ.. అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కన్నడ నటుడు చేతన్ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్కు తరలించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలోనూ …
Read More »బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్బీకే 108 . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ సారి మీ ఊహలకు అందని విధంగా.. అంటూ బాలకృష్ణ కోరమీసంతో ఉన్న లుక్ను షేర్ చేసింది షైన్ స్క్రీన్ బ్యానర్. …
Read More »మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ మృతి
జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి కి గతంలో ఆమె చైర్ పర్సన్గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.
Read More »