వారంలో రెండు రోజులు మటన్, ఐదు రోజులు చికెన్..ప్రతిరోజూ గుడ్డుతోపాటు స్వీటు, నెయ్యి…ఇదీ కార్పొరేట్ హాస్టల్లలోని మెనూ కాదు. కస్తూరిబా పాఠశాలల్లో త్వరలో అమలయ్యే మెనూ.. ఇప్పటికే సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా..ఇక కార్పొరేట్ విద్యాలయాలకు మిన్నగా అదిరిపోయే ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మౌలిక వసతుల్లో లోటు లేకుండా వేడినీళ్ల కోసం సోలార్ గీజర్లను ఏర్పాటు చేయబోతున్నది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మెనూ ప్రారంభించేందుకు సన్నాహాలు …
Read More »తెలంగాణ పోలీస్..త్రిముఖ వ్యూహం సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం సక్సెస్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించింది. నిధులు, నియామకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న విషయం విదితమే! ఈ క్రమంలోనే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు అనే నినాదాన్ని తీసుకొచ్చింది. పోలీసులంటే ప్రజలు వణికిపోవాల్సి న అవసరంలేదని, ఇతర ప్రభుత్వ శాఖల తరహాలోనే పోలీసు శాఖ ప్రజలకు సేవలు అందించే ఒక …
Read More »ఆర్కే నగర్ ఉపఎన్నిక : దూసుకుపోతున్న దినకరన్
తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నైలోని ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 258 బూత్లలో లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపును పూర్తి చేస్తారు. 18 రౌండ్లలో 252 బూత్లలో ఓట్లను లెక్కింపు జరగగా.. ఆఖరి రౌండ్లో ఆరు బూత్లలో లెక్కింపు …
Read More »నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాక
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శివార్లలోని హకీంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం …
Read More »పాపం సచిన్ అంటున్న వెంకయ్యనాయుడు..!
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్పై మరోమారు భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తన సానుభూతి తెలిపారు. హైదరాబాద్ రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ లో స్వర్ణోత్సవ సంబురాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయుష్ మందుల ప్రాధాన్యతను గుర్తించారు కానీ తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు రాజకీయ కారణాలు ఏమి లేవని…అవగాహన రాహిత్యం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. మన ఆలోచన జీవన విధానాల్లో మార్పులు రావాలని …
Read More »మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు క్రేజీ ఫొటోలు చూశారా..?
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ ఇద్దరు మంత్రులు సరదాగా ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు పలువురు షేర్ చేస్తూన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినేష్ డీటీపీ (దినేష్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్) పేరుతో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »గంటలోనే సాయం చేసి..ప్రాణం కాపాడిన..కేటీఆర్
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి గురించి ఆయన మిత్రుడు సహాయం చేయాలని కోరగా మంత్రి కేటీఆర్ గంట వ్యవధిలో స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు సహాయం అందించి ఆయన ప్రాణాలు నిలిపేలా చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన …
Read More »That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు . వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష …
Read More »ఇంకెంతకాలం ఆ విధంగా మోసం చేస్తారు..?
బాక్సాఫీస్ వద్ద వరుసబెట్టి ఏడు హిట్ సినిమాలున్న నాని ఎనిమిదవ సినిమాకి ఆకాశమంత క్రేజ్ రావడం, భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే అదేదో గొప్పదనమని ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. సినిమా చూసినవాళ్లలో ఒక 20 శాతం లేదా 30 శాతం మంది బాలేదు అంటే.. మిగతా వారికి నచ్చింది అనుకోవచ్చు. అయితే నాని నుండి వచ్చిన తాజా ఎంసీఏ చిత్రం ఏకగ్రీవంగా 70 శాతం పైగా …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా”జననేత జగన్ “జన్మదిన వేడుకలు.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్ ఆర్ ఐ శాఖ విక్టోరియా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ పాటి మరియు కన్వినర్ కౌశిక్ మామిడి ఆధ్వర్యంలో మెల్బోర్న్ లోని ప్లంప్టన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొని, జెండాలు చేతబూని భారీ కారు ర్యాలీ నిర్వహించి, …
Read More »