Home / SLIDER (page 255)

SLIDER

గోశాలకు పశుగ్రాసం వితరణ

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు లోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందుగల గోశాలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కల్లూరు సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు రాధిక దంపతులు ఈరోజు పశుగ్రాసాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ గోశాలకు ఆ దంపతులు ప్రతి సంవత్సరం వారికి తోచిన మేరకు గ్రాసం ను వితరణ చేస్తున్నారు, …

Read More »

కేజీ టు పీజీ క్యాంప‌స్‌@గంభీరావ్‌పేట‌.. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంది. ప్ర‌తి విద్యార్థిని ఉన్న‌త విద్యావంతుడిగా మార్చాల‌న్న ల‌క్ష్యంతో అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం కేజీ టు పీజీ విద్యావ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేస్తోంది. ఒకే క్యాంప‌స్‌లో కేజీ టు పీజీ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఓ …

Read More »

దేశంలో కొత్త‌గా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు

దేశంలో కొత్త‌గా గ‌త 24 గంట‌ల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఈ విష‌యాన్ని తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. వైర‌స్ నుంచి రిక‌వ‌రీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.గ‌త 24 గంట‌ల్లో 184 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. …

Read More »

సంగారెడ్డిలో దారుణం

  తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అమీన్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని శ్రీవాణిన‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. భార్య‌, కుమారుడు, వ‌దిన‌పై శ్రీనివాస్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వ‌దిన సుజాత అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. భార్య సునీత‌, కుమారుడు సాయికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న …

Read More »

ప్ర‌జ‌ల ఆరోగ్యానికి తోడ్ప‌డే వంగడాల‌ను రూపొందించాలి : గవర్నర్ తమిళిసై

దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు ఒక భాగమని తెలంగాణ‌ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాగే.. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగాల ఉత్ప‌త్తే ల‌క్ష్యంగా ఉద్యాన ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా ల‌క్ష్మ‌ణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం రెండో స్నాత‌కోత్స‌వంలో ముఖ్య అతిథిగా గ‌వ‌ర్న‌ర్ పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు వ్యవసాయం, ప్రత్యేకించి ఉద్యాన కోర్సులు ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఔష‌ద పంట‌ల‌పైనా …

Read More »

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా …

Read More »

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంట రుణాలుగా రూ. 73,437 కోట్లు, అనుబంధ రంగాలకు టర్మ్‌లోన్‌ కింద రూ.39,326 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక మొత్తంగా అన్ని రంగాలకు కలిపి రూ.1.85 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికను గురువారం నగరంలోని …

Read More »

తెలంగాణలో మరో రూ.200 కోట్ల పెట్టుబడి

వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్‌ జపాన్‌.. తెలంగాణలో ఓ ప్లాంట్‌ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని వ్యాపీలో ఓ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్‌లో రెండో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలపై సంస్థ దృష్టిసారించింది. తమ తదుపరి ప్లాంట్‌ ఏర్పాటుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను పరిశీలిస్తున్నది. ఆయా రాష్ట్ర …

Read More »

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీ ఫేస్-2 కి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat